వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు కుల వివాదంలో చిక్కుకున్నారు.ఆమె కులం ఏంటో తేల్చేందుకు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.
పూర్తి వివరాలు పరిశీలిస్తే గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల వివాదంలో చిక్కుకున్నారు.ఆమె ఎస్సీ కమ్యూనిటీ కి చెందినవారు అవునో కాదో పూర్తి వివరాలు తేల్చాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు.ఆ సందర్భంగా శ్రీదేవి తగిన సర్టిఫికెట్లు ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.
రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.ఒకవేళ శ్రీదేవి అందుకు తగిన ఆధారాలు సమర్పించకపోతే ఆమె ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించే అవకాశం ఉంది.
అసలు ఈ వివాదం రావడానికి కారణం ఆమె ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని చెప్పుకోవడంతో అసలు ఈ వివాదం మొదలైంది.ఈ నేపథ్యంలో శ్రీదేవి ఎన్నిక చెల్లదంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శ్రావణ్ పై పోటీ చేసి విజయం సాధించారు.