టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి ప్రతి ఒక్కరుతో సన్నిహితంగా వెలుగుతూ ఉంటాడని మంచి టాక్ ఉంది.అయితే ఇందులో ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మరియు ప్రొడ్యూసర్ మోహన్ బాబు చిరంజీవి ఇద్దరి మధ్య మైత్రి చాలా బాగుంటుందని ఇప్పటికే పలు సందర్భాల్లో ఇద్దరూ నిరూపించారు కూడా.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఉగాది పండుగను పురస్కరించుకొని సోషల్ మీడియా మాధ్యమాలు అయినటువంటి ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ లలో ఖాతాలు తెరిచిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఇందుకుగాను ఇప్పటికే పలువురు సినీ స్టార్లు మరియు చిరంజీవి సన్నిహితులు అందరూ కలిసి మెగాస్టార్ చిరంజీవి ప్రపంచానికి గ్రాండ్ గా స్వాగతం పలికారు.
అయితే తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఆహ్వానిస్తూ వెల్ కమ్ మిత్రమా అంటూ ట్వీట్ చేసాడు.దీంతో వెంటనే స్పందించి నటువంటి చిరంజీవి థాంక్యూ మిత్రమా, రాననుకున్నావా ? రాలేననుకున్నావా ? అంటూ మోహన్ బాబు ని ట్యాగ్ చేస్తూ సరదాగా రిప్లై ఇచ్చాడు.దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో వీరిద్దరూ నటించినటువంటి బిల్లా రంగా అనే చిత్రాన్ని ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ మరియు కలక్షన్ కింగ్ రెండవ తనయుడు మంచు మనోజ్ ఇద్దరు కలిసి రీమేక్ చేస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అంతేకాక ఇప్పటికే టాలీవుడ్ లో రామ్ చరణ్ తేజకి సన్నిహితంగా ఉన్నటువంటి ఓ దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు గాను స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసే పనిలో పడినట్లు సమాచారం.అయితే అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంది.
మరోసారి ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అయితే బాక్సాఫీసు బద్దలవడం ఖాయం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
.