తెలంగాణలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలతో హైదరాబాద్ లోని ఓ ఇళ్లు కుప్పకూలింది.
ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని పాతకాలం నాటి ఇల్లు కూలింది.అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ ఇంట్లో లేకపోవడం తో ప్రాణనష్టం తప్పింది.
అయితే ప్రతి సంవత్సరం వర్షాకాల ప్రారంభానికి ముందు అధికారులు పురాతన ఇళ్లు, భవనాలను గుర్తించి వాటిని తొలగించాల్సిన సంగతి తెలిసిందే.అయితే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.