తెలంగాణలో సీఎం కేసీఆర్కు బాగా కావాల్సిన ఇద్దరు మంత్రుల మధ్య ఇప్పుడు కోల్డ్వార్ నడుస్తోందన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.తెలంగాణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హవా ఇప్పుడు ఓ రేంజ్లో నడుస్తోంది.
తుమ్మలపై కేసీఆర్ ప్రసంసల వర్షం కంటిన్యూ అవుతోంది.ఇటీవల భక్త రామదాసు ప్రాజెక్టును సైతం రికార్డు స్థాయి టైంలో కంప్లీట్ చేయడంతో మిగిలిన మంత్రుల కన్నా ఇప్పుడు తుమ్మల ఏం చెపితే అది కేసీఆర్ మంజూరు చేసేస్తున్నారు.
ఇక తెలంగాణ ఉద్యమ టైం నుంచి జగదీశ్రెడ్డి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు.ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రుల మధ్య ఓ విషయంలో కోల్డ్వార్ నడుస్తోందన్న ప్రచారం టీ పాలిటిక్స్లో జరుగుతోంది.
ఓ పదవి విషయంలో ఈ ఇద్దరు ఆధిపత్యం కోసం చేస్తోన్న పోరాటంలో టీఆర్ఎస్ క్యాడర్ బాగా నలిగిపోతోందట.
మంత్రులు తమ్మల, జగదీశ్రెడ్డి వేర్వేరు జిల్లాలకు చెందిన వారు.
వీరిద్దరి మధ్య గ్యాప్కు నల్లగొండ డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ కారణమైంది.నల్గొండ జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్ రేసులో ఉన్న వ్యక్తి మంత్రి తుమ్మలకు బాగా కావాల్సిన వ్యక్తి అట.ఆ వ్యక్తి విషయంలో జగదీశ్రెడ్డి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారట.అటు తుమ్మల ఆ వ్యక్తి కోసం జోరుగా లాబీయింగ్ చేస్తుంటే…ఇటు జగదీశ్రెడ్డి ఆ వ్యక్తి డీసీసీబీ చైర్మన్ కాకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారట.
నల్గొండ తుమ్మల సొంత జిల్లా కాదు.వీరిద్దరూ కేసీఆర్కు సన్నిహితులే అయినా తుమ్మలపైనే కేసీఆర్కు ప్రేమ ఎక్కువ.తుమ్మల తన పక్క జిల్లాలో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ ఏమీ అనడం లేదని తెలుస్తోంది.ఇక పార్టీలో తుమ్మల కంటే ఎంతో సీనియర్ అయిన తనకు ఈ విషయంలో తుమ్మల అడ్డు వస్తుండడం…ఈ మ్యాటర్లో అధిష్టానం కూడా చూసీ చూడనట్టు ఉండడంతో జగదీశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్.