అరటిపళ్ళలో విషం పెట్టి 20 ఆవులను చంపారు.. ఆతర్వాత!?

మనుషులు రోజు రోజుకు చాలా కఠినంగా మారిపోతున్నారు.ఒకొక్కసారి మనుషులు చేసే పనులు చూస్తే ఛీ ఇంత ఘోరంగా దారుణంగా ఉన్నారు ఏంటి అని అనిపిస్తుంది.

 Coffee Estate Manager Killed 20 Cows With Banana, Coffee Estate Manager , Poison-TeluguStop.com

మొన్నటికి మొన్న కేరళలో ఓ ఏనుగుకు పండులో బాంబు పెట్టి తినిపించి చంపేశారు.ఇంకా నిన్నటికి నిన్న ఓ కోతిని ఉరి వేసి చంపేశారు.

ఇప్పుడు ఆవులు తినే అరటి పళ్లలో విషం పెట్టి 20 ఆవులను దారుణంగా చంపేశారు.ఇంకా ఈ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో చోటుచేసుకుంది.

కాఫీ తోటలోకి ఆవులు చొరబడి ఆకులను తింటున్నాయనే కారణంతోనే మేనేజర్ మరియు సిబ్బంది ఆవులకు అరటిపళ్ళలో విషం పెట్టి తినిపించేవారట.

ఇంకా ఆవులు మరణించిన తర్వాత విషయం భయటకు రాకుండా ఆవుల మృతదేహాలను ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి అందులో పూడ్చి పెట్టేవారు.

ఆలా ఇప్పటివరకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఆవులను చంపి పూడ్చి పెట్టారు.అయితే ఆవులు మాయం అవ్వడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చింది.

దీంతో ఎస్టేట్ వద్ద ఆవుల కోసం గాలించగా అక్కడ ఆవుల కళేబరాలు కనిపించగా విషయం బయటపడింది.దీంతో ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube