యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ తయారీలో మరోసారి అధికారులు నిర్లక్ష్యం బయటపడింది.ఓ భక్తుడు కొన్న లడ్డూలో బొద్దింక ప్రత్యక్షమైంది.
దీంతో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడ్డారు.హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు ఆలయంలో లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు.
అయితే లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవాక్కయ్యాడు.
గతంలోనూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని అధికారుల దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అయితే లడ్డూ ప్రసాదంలో పురుగు వచ్చినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు.