సాదారణంగా కోళ్ల పందాల సమయంలో పందెపు కోళ్లను జైల్లో పెట్టడం, పోలీసు స్టేషన్కు కోళ్లను తీసుకు వెళ్లడం వంటివి చేస్తారు.కోడి పందేలు నిషేదం కనుక ఇలా కోళ్లను జైల్లో పెడతారు.
కాని మద్య ప్రదేశ్లోని శివపురికి చెందిన ఒక కోడిని ఒక నేరం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ కోడి పందెం కోడి కాదు, అలా అని అది ఎవరిని హత్య చేయలేదు.
కాని ఆ కోడి ఒక చిన్న బాలుడిని పొడిచింది.అందుకే ఆ కోడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేయడమే కాకుండా న్యాయస్థానం ముందుకు తీసుకు వెళ్లేందుకు కూడా సిద్దం అయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… మద్యప్రదేశ్లోని శివపురికి చెందిన పప్పు, లక్ష్మీ దంపతులకు సంతానం లేరు.దాంతో వారు అయిదు సంవత్సరాలుగా ఒక కోడి పుంజును పెంచుతున్నారు.అయిదు సంవత్సరాలుగా బాదాం, జీడిపప్పులు పెడుతూ ఆ కోడిని బాగా పెంచారు.
ఆ కోడి బాగా అల్లరి చిల్లరగా పెరిగింది.చుట్టు పట్ల ఉన్న వారిని ఇబ్బంది పెడుతూ, ఇతర కోళ్లను పొడుస్తూ అంతా నా ఇష్టం అన్న తరహాలో తయారు అయ్యింది.
మొత్తంగా ఒక పందెం కోడి మాదిరిగా తయారు అయ్యి, పందెం లేక పోవడంతో రోడ్డు మీద పందెం ఆడేందుకు సిద్దం అయ్యింది.
ఆ కోడి తాజాగా ఒక చిన్నారి చెంప మీద బలంగా పొడిచింది.దాంతో ఆ చిన్నారి బుగ్గపై రక్తం వచ్చింది.చిన్నారికి గాయం అవ్వడంతో ఆ చిన్నారి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కోడిని అదుపులోకి తీసుకున్నారు.ఆ కోడిని పెంచిన లక్ష్మి మరియు పప్పులు ఎంత బతిమిలాడినా కూడా పోలీసులు ఒప్పుకోవడం లేదు.
కేసు పెట్టిన వారికి నష్టపరిహారం చెల్లించి కోడిని విడిపించుకునేందుకు పప్పు దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఏం జరగనుందో చూడాలి.