ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగా అందరికి వ్యాక్సిన్ అందించేలా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇండియాలో అతి పెద్ద సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్ వారు తమకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు.
కోల్ ఇండియాలో ఇప్పటికే 400 మంది కరోనా బారిన పడి చనిపోయారన్. 2.59 లక్షల మంది ఉగ్యోగులు ఉండగా తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ అందించాలని కోరారు.తమ కోసం 10 లక్షల డోసులను కేటాయించాల్సిందిగా కోల్ ఇండియా లిమిటెడ్ కోరింది.
ప్రస్తుతానికి 25% ఉద్యోగులకు మాత్రమే టీకాలు అందాయని.ఇంకా 64 వేల మంది టీకా వేసుకోవాల్సి ఉందని చెప్పారు.
కోల్ ఇండియా ఉద్యోగులకు వ్యాక్సి వేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని వారి కోసం 10 లక్షల డోస్ లను కేటాయించాలని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.కరోనా లాక్ డౌన్ టైం లో కూడా బొగ్గు గని ఉద్యోగులు, కార్మీకులు వారి డ్యూటీలను చేశారు.అందుకే కోల్ ఇండియా ఉద్యోగులకు వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.