నేడు దేశ వ్యాప్తంగ కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ ను అందజేస్తారు.
ఈ నేపథ్యంలో వైద్యులు, పోలీసు లు ఫ్రంట్ లైన్ వర్కర్స్ , పరిశుద్య కార్మికులు మొదలైన వారు ఈ లిస్ట్ లోకి వస్తారు.ప్రస్తుతం ఇండియా రెండు వ్యాక్సిన్ లను సిద్దం చేసింది.
ఒక్కటి సీరం తయారు చేసిన కోవిషీల్డ్.భారత్ బయో టెక్ తయారు చేసిన కోవాగ్జిన్.
ఈ రెండు టీకా లో ప్రస్తుతం ఏ టీకా వేసుకోవలో అనే విషయంపై ప్రజల్లో ఎలాంటి ఖండిషన్ లేదు కానీ రానున్న రోజుల్లో కోవాగ్జిన్ టీకా విషయంలో ఓ రూల్ ను తీసుకువచ్చారు.ఎందుకు అంటే కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగం కింద ఈ టీకాను ఇప్పుడు తీసుకువస్తున్నారు.
సీరం తయారు చేసిన కోవిషీల్డ్ టీకాను తీసుకుంటే మాత్రం ఎలాంటి అంగీకార పత్రం అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు.కోవాగ్జిన్ టీకాను తీసుకుంటే మాత్రం వారి నుండిఅంగీకారపత్రం తో పాటుగా ఏడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశాడు.
ఇలా అయితే కోవాగ్జిన్ టీకాను ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలవ్వుతుంది.ఈ టీకా సురక్షితం అయినప్పటికి అంగీకారంతో కూడిన పత్రం ఇవ్వాలంటే సందేహం కలగక మానదు.
.