తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్. సీఎంకు ఆలయం వద్ద స్వాగతం పలికిన టీడీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి.
శ్రీవారి దర్శనం తర్వాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామి వారిని దర్శించుకున్న సీఎం వైయస్ జగన్.
అనంతరం ఆలయంలోని తులాభారం మొక్కు తీర్చుకున్న సీఎం.
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును ప్రారంభించిన సీఎం.ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్.