తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఏపీ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు నిర్మిస్తోంది.కతరపల్లి, ముక్కలకండ్రిగ గ్రామాల వద్ద కోశస్థలి నదిపై రెండు చోట్ల డ్యామ్ లు నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది.
అయితే, ఈ రెండు ప్రాజెక్టులపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.భవిష్యత్ లో చెన్నై నగరానికి పూర్తి స్థాయిలో తాగునీటి సమస్య ఏర్పడే ముప్పు ఉందంటూ సీఎం స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
కోశస్థలి నదీ పరీవాహక ప్రాంతం రెండు రాష్ట్రాల్లో ఉందని, ఏపీలో 877 కిలోమీటర్లు కాగా, తమిళనాడులో 2,850 కిలోమీటర్లు అని వివరించారు.ఈ నదిపైనే పూండి రిజర్వాయర్ కు నీటి లభ్యత తగ్గిపోతుందని సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.
దీని వల్ల చెన్నై నగరానికి తీవ్ర నీటి కొరత ఏర్పడటమే కాకుండా, పరిసర గ్రామాలపైనా ఆ ప్రభావం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.