దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.గత కొద్దిరోజుల నుండి ఒక్కసారిగా కేసులు పెరగటంతో…వైద్య నిపుణులు దేశంలో థర్డ్ వేవ్ స్టార్ట్ అయినట్లే అని కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ లలో భారీగా కేసులు నమోదు కావడంతో.అక్కడి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇప్పుడు ఇదే తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో పాటు… ఒమిక్రాన్ కేసులు.నమోదు అవుతుండటంతో తమిళనాడు సీఎం స్టాలిన్ లాక్డౌన్ కి సంబంధించి వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
విషయంలోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.తమిళనాడులో ఇప్పటికే సినిమా హాళ్లు, మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఆదివారం లాక్ డౌన్ విధించిన స్టాలిన్ ప్రభుత్వం.ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థలకి సంబంధించి సరికొత్త ఆంక్షలు విధించడం జరిగింది.