వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా ముందుగా ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించనున్నారు.
జిల్లా అభివృద్ధి ఇతర అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.అనంతరం జాతీయ పార్టీ నేపథ్యంలో వరంగల్లోని శ్రీ భద్రకాళీ అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం.సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చర్యలు తీసుకుంటున్నారు.