వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రతిమ మెడికల్ కాలేజీని ఆయన ప్రారంభించారు.350 పడకల సామర్ధ్యంతో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మితమైంది.దీంతో విద్యార్థులకు 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.కేంద్ర మంత్రులు వచ్చి తిట్టి పోయిన మర్నాడే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయన్నారు.
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని కేసీఆర్ ఆరోపించారు.రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు.
వైద్య విద్య కోసం ఇంకా తెలంగాణ విద్యార్థులు రష్యా, చైనా, ఉక్రెయిన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.రాష్ట్రంలోనే వైద్య విద్య చదివేందుకు సరిపడా సీట్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.