జగిత్యాల జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ లో జగిత్యాలకు ఆయన చేరుకునే అవకాశం ఉంది.ముందుగా టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.తర్వాత రూ.110 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.నూతన కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.అనంతరం జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలెక్టరేట్ లో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.మెతే రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.