మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హాజరైయ్యారు.
ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్, ప్రచారం అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.మునుగోడు బరిలో జాతీయపార్టీ బీఆర్ఎస్ గా బరిలో దిగనున్న సంగతి తెలిసిందే.
గెలుపే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.ఈ క్రమంలోనే మండల ఇంఛార్జులను నియమించింది పార్టీ అధిష్టానం.
కాగా ఈనెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్న సంగతి తెలిసిందే.