తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సతీమణి శోభ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
కరోనా రెండవ దశలో సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే.అనంతరం అతని భార్య శోభ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఆమె కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది.
అయితే కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడినప్పటికీ ఈమె మాత్రం ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న కెసిఆర్ భార్య శోభను హైదరాబాద్ లోని పలు ఆసుపత్రిలలో చూపించినప్పటికీ కొందరు డాక్టర్ల సూచన ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాను కలవడం ఉత్తమమని చెప్పడంతో శుక్రవారం కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూతురు కవితతో కలిసి శోభ ఢిల్లీ వెళ్లారు.
ఈ క్రమంలోనే అక్కడ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆమెకు కొన్ని పరీక్షలు నిర్వహించారు అనంతరం పరీక్ష ఫలితాలను చూసిన వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేరాల్సి ఉందిగా సూచించడంతో శోభ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు.ఇక శుక్రవారం ఢిల్లీ వెళ్లిన వీరు పరీక్షల నిమిత్తం శనివారం హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉండగా వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరడంతో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లారు.దీంతో కెసిఆర్ కుటుంబ సభ్యులు మొత్తం ఢిల్లీలోనే ఉన్నారు.అయితే ఈమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు అబ్జర్వేషన్ పూర్తి కాగానే ఈమెను డిస్చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.