చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు.ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుండి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ బయలుదేరనున్నారు.
మూడురోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి పూజ చేయడానికి ఈ రోజు కేసీఆర్ ఢిల్లీ కి బయలుదేరుతున్నారు.
రేపు జరగనున్న భూమి పూజ కోసం టిఆర్ఎస్ పార్టీ మంత్రులు.ఎమ్మెల్యేలు.
ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ బయలుదేరనున్నారు.
ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది.టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పదమూడు వందల చదరపు అడుగుల గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది.వసంత విహార్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న స్థలంలో టిఆర్ఎస్ పార్టీ కి స్థలం కేటాయించడం జరిగింది.
ఇదిలా ఉంటే పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు గా వస్తున్న క్రమంలో ఢిల్లీలో పార్టీ నీ భావన శంకుస్థాపన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది అని విశ్లేషకులు అంటున్నారు.