తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడి చేయడం కోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇదే తరుణంలో మెడిసిన్ విషయంలో ఎక్కడ బ్లాక్ మార్కెట్ రాష్ట్రంలో లేకుండా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి బాధితులకు సకాలంలో కరోనా చికిత్స అందేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ హాస్పిటల్ లో పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రికి కెసిఆర్ వస్తూ ఉండటంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఈటెల రాజేందర్ ని మంత్రి పదవి నుంచి తొలగించడం తో ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ తన పరిధిలోనే కేసీఆర్ ఉంచుకొన్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ లో కరోనా రోగులకు అందుతున్న వైద్యాన్ని.
కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించాలని డిసైడ్ అయ్యారు.అదేవిధంగా వైద్యులతో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం.