తెలంగాణ ముఖ్య మంత్రికి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటి నుండి గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే.కాగా ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని నిర్ధారణ జరగగా ప్రస్తుతం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అని ఆయనకు సేవలందిస్తున్న వైద్య బృందం తెలిపింది.
కాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో కేసీఆర్ తిరిగి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకున్నారు.ఈ క్రమంలో ప్రగతి భవన్ లో కరోనా పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.
కాగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నదని తెలుస్తుంది.ఇకపోతే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, ఏప్రిల్ 20 వ తేదీ నుంచి అమలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే మే 8 వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుండటంతో దీనిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.మరి ఏ విషయం తెలియాలంటే ఇంకాస్త ఆగవలసిందే.