సీఎం కేసీఆర్ కు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు చెడిన దగ్గరి నుంచి ఇద్దరి నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గునే స్థాయికి వివాదం చలరేగింది.ఇక దాంతో హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటలను ఎలాగైనా ఓడించాలని సీఎం కేసీఆర్ శత విధాలా ప్రయత్నించారు.
అయితే ఈటలను టార్గెట్ చేయడంతో.నియోజకవర్గ ఓటర్లు మాత్రం బీజేపీకే పట్టం కట్టారు.
దాంతో కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఈటలను ఓడించాలని ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టు తెలుస్తోంది.నియోజకవర్గంలోని నేతలందరికీ సీరియస్ క్లాస్ పీకినట్టు కూడా తెలుస్తోంది.
ఈటలను ఓడించేందుకు.హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతలకు కొందరికి హామీలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా ఇప్పటికే పలువురు నేతలు పదవులు నజరానా కూడా ఇచ్చేశారు.తాజాగా హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందకు మంత్రి కేటీఆర్ గెల్లు శ్రీనివాస్ కు కాకుండా.ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఏకంగా ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు.
అంతే కాకుండా వకుళాభరణానికి కుడా పదవి ఇచ్చి ఆయన సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ వైపుకు తిప్పుకున్నారు.
కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు కూడా పెద్ద హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈటలకు కుడి భుజంగా ఉండే ఒక నేతను త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఈ సారి ఈటల రాజేందర్ ను అష్టదిగ్భందనం చేసి.
మునుగోడులా గెలుపు సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.మరి కేసీఆర్ అష్టదిగ్భందనం నుంచి ఈటెల తప్పించుకుని విజయకేతనం ఎగురవేస్తారా.? లేక కేసీఆర్ రాజకీయంలో ఓడిపోతారా అనేది చూడాలి.