కేంద్రంతో యుద్ధం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు.లిక్కర్ స్కాం కేసులో కవితను టార్గెట్ చేయడంపై గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ వేదికగా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులను సీఎం కేసీఆర్ ప్రస్తావించనున్నారు.అదేవిదంగా బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తీరుపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.
గవర్నర్ ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే యోచనలో ఉంది.ప్రజాక్షేత్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ప్రస్తావించేలా కేసీఆర్ ప్యూహం ఉండనుందని సమాచారం.
కవితకు సీబీఐ నోటీసులపై న్యాయ సలహాలు స్వీకరిస్తున్నారు.అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్న కవిత డిసెంబర్ 6న వివరణ ఇవ్వనున్నారని తెలుస్తుంది.
లిక్కర్ స్కాంలో ఇప్పటికే కవితకు సీబీఐ నోటీసులు అందిన సంగతి తెలిసిందే.