తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి భారీగా ఉన్న సంగతి తెలిసిందే.సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.
దీంతో కేసులు రోజురోజుకీ పెరుగుతూ ఉండటంతో హాస్పిటల్స్ లో కరోనా రోగులు బెడ్ కొరతతో పాటు ఆక్సిజన్ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు .ఇలాంటి తరుణంలో తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు.కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.మేటర్ లోకి వెళ్తే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ పై సమీక్షించాలని ఆదేశించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గాంధీ, టిమ్స్ హాస్పిటల్స్ వద్ద ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఆక్సిజన్ కొరత ఉండటంతో సైనిక విమానాల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఇంట్లో చికిత్స పొందుతున్న వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లు కొరత లేకుండా చూసుకోవాలని.తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కు సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
.