తెలంగాణ నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ మండిపడినట్లు తెలుస్తోంది.ప్రమాద వివరాలు తెలుసుకున్న కేసీఆర్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు.
సచివాలయం నిర్మాణం పూర్తి అయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి ఘటనకు గల వివరాలు తెలుసుకున్నారు.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారని సమాచారం.