తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.ఈ మేరకు హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలతో ఆయన సమావేశం అయ్యారు.
సమావేశాల ఎజెండా ఖరారుపై దృష్టి సారించారు.కాగా డిసెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపైనా సీఎం కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం.కేంద్రం అనుసరిస్తున్న విధానాలతోనే తెలంగాణకు ఆర్థిక ఇబ్బందులని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు.