ఇందిరాపార్కు దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… వరి ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది.కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతోంది.
రైతు చట్టాలను విరమించుకోవాలని ఫైట్ చేస్తున్నాము.ఈ యుద్ధం ఇవ్వాళ్టితో ఆగిపోదు- ఇది ఆరంభం మాత్రమే- అంతం కాదు.
ఉత్తరభారత రైతులను కలుపుకొని పోరాటం ముందుకు తీసుకెళ్లాలి.పంజాబ్ తహరలో తెలంగాణ పంటను కొనుగోలు చెయ్యాలి.
తెలంగాణ రైతు సమస్యలు దేశానికి తెలియాలని ఈ ధర్నా.ఈరోజుతో ఆగే పోరాటం ఇది కాదు- ఇది ఆరంభం మాత్రమే.
రైతు సమస్యలపై హైదరాబాద్ నుంచి పోరాటం మొదలైంది.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… కార్పొరేట్లు దేశానికి అన్నం పెట్టలేరు.
మోడీ ప్రభుత్వం కార్పొరేట్లను పెంచిపోషిస్తోంది.రైతుల ధర్నాలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఎంత బాధ ఉంటే పాల్గొంటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్ లో ప్రారంభం అయిన ఈ యుద్ధం ఇక్కడితో ఆగదు.అవసరం అయితే ఢిల్లీ వరకు యాత్ర చేయాల్సిన అవసరం ఉంటది.పరాయి పాలన నుంచి ఇప్పుడిప్పుడే స్వేచ్చా వాయువులు తీసుకుంటున్నాము.2006లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉండి మోడీ 51 గంటలు ధర్నా చేశారు.
ముఖ్యమంత్రులు, మంత్రులు ధర్నాలు చేయకుండా పాలన చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటది.పనేం లేఖ ధర్నాలు మేము చేయడం లేదు, రైతులు ఆందోళనలో ఉన్నారు కాబట్టే ధర్నా చేస్తున్నాము.ప్రభుత్వాలు ధర్నాలు చేయడం కొత్తేమి కాదు.2006లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉండి మోడీ 51 గంటలు ధర్నా చేశారు.ముఖ్యమంత్రులు- మంత్రులు ధర్నాలు చేయకుండా పాలన చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటది.