తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెందిన ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఈ విషయానికి సంబంధించి ప్రధాని మోడీ కి జలవనరుల శాఖ మంత్రి కి లెటర్లు రాయటం జరిగింది.ముఖ్యంగా కృష్ణా నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటుంది అంటూ ఏపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా ఈ నీటి గొడవల విషయంలో సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ….జల వివాదం విషయంలో ఏపీ తో తాడోపేడో తేల్చుకునే రీతిలో.
సీఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు తెలియజేశాయి.
అంతేకాకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగిన సమయంలో ఈ నీటి గొడవ విషయంలో సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించినట్లు కూడా పేర్కొనటం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఇంకా కృష్ణ జలాల విషయంలో అనుమతులు లేకపోయినా ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు.నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు కెసిఆర్ మండిపడినట్లు వార్తలు రావడం తెలిసిందే.
అంతమాత్రమే కాకుండా అవసరం అయితే ఈ విషయంలో ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో ధర్నా నిర్వహించడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.పరిస్థితి ఇలా ఉండగా.
ప్రస్తుతం జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు కేసీఆర్ త్వరలో ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకుని కేంద్ర మంత్రులతో అదే రీతిలో ఉన్నత అధికారులతో.ఏపీ తో నీటి వివాదం విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు.
నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.