తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా బోనకల్ మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.
అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.ఏరియల్ సర్వే చేసిన సీఎం కేసీఆర్ అనంతరం రోడ్డుమార్గంలో ప్రయాణించి రావినూతలలో పంట పొలాలను పరిశీలించారు.
అనంతరం గార్లపాడు, రామాపురం వెళ్లనున్న కేసీఆర్ అక్కడ పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడనున్నారు.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.