రేపు గుడివాడ నియోజకవర్గంలో( Gudivada Constituency ) టిడ్కో ఇళ్ళ( TIDCO Houses ) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం జగన్( CM Jagan ) ప్రారంభించాల్సి ఉంది.అయితే ఆఖరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సీఎం క్యాంప్ ఆఫీస్ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని ఈనెల 16న పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుడివాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మల్లయ్యపాలెం చేరుకుంటారు.
అక్కడి టిడ్కో ఇళ్ళనీ ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటిస్తారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి చేరుకునేలా షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది.అయితే ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన వాయిదా పడటం జరిగింది.ముఖ్యమంత్రి గుడివాడ పర్యటన వాయిదా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
దాదాపు 8 వేలకు పైగానే టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించే ఈ కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో ఏర్పాట్లు అన్ని పూర్తయిన సమయంలో చివరి నిమిషంలో ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడటం సంచలనంగా మారింది.