మండౌస్ తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.తుపాను ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు.అదేవిధంగా అవసరమైన చోట పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ తీరం దాటింది.దీంతో తీర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
గత అర్ధరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య ఉన్న మహాబలిపురం సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటింది.ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.