వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.దీనిలో భాగంగా ఆరోగ్య శ్రీ విధానంపై సమీక్షించారు.
ఈ మేరకు గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.ఆరోగ్య శ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లను అనుమతించారు.
దీంతో ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ కింద 3,118 చికిత్సా విధానాలు వచ్చాయి.ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వ్యవహరించనున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని కీలక సంస్కరణలకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్స్ అన్నీకూడా సంబంధిత జిల్లాలోని మెడికల్కాలేజీ పరిధిలోకి తీసుకురావాలన్నారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.