CM Jagan PM Modi : ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీతో సీఎం జగన్..!!

నవంబర్ నెలలో ఇండోనేషియాలో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం తెలిసిందే.అయితే ఈ సదస్సులో వచ్చే ఏడాది జీ-20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోడీ అందుకోవటం జరిగింది.

 Cm Jagan With Pm Modi In Video Conference Today Evening , Ap Cm Jagan, Pm Modi,g-TeluguStop.com

ఈ క్రమంలో వచ్చే ఏడాది జీ-20 అంతర్జాతీయ సదస్సులకు భారత్ వేదిక కానున్న నేపథ్యంలో ఇటీవల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది.

ఇదిలావుంటే ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సదస్సుకు విశాఖ వేదిక కానుంది.

దీంతో జీ-20 సదస్సు సన్నాహాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3,4,5 తారీకులలో విశాఖ వేదికగా వ్యవసాయం, ఆర్థిక రంగం, విద్యా, వైద్యం ఇంకా వివిధ అంశాలపై 37 సమావేశాలు నిర్వహించాలని కేంద్రం డిసైడ్ అయింది.

ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube