ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా చరవాణి ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి నిండు ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని సీఎం జగన్ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు.
సోషల్ మీడియాలో గవర్నర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.జగన్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది.
ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బిశ్వ భూషణ్ హరిచందన్ 3ఆగస్టు 1934వ సంవత్సరంలో పుట్టారు.నేడు 88వ వసంతంలోకి అడుగు పెట్టడం జరిగింది.2019 జులై 17వ తారీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు.రాజకీయ నాయకుడు మాత్రమే కాదు న్యాయవాది ఇంకా కవి, రచయిత, అవినీతిపై పోరాడే యోధుడిగా బిశ్వ భూషణ్ హరిచందన్ కి మంచి పేరుంది.
ఏపీ గవర్నర్ పట్ల సీఎం జగన్ చాలా శ్రద్ధ తీసుకుంటారు.వయసులో పెద్దవారు కావడంతో.జగన్ దంపతులు అప్పుడప్పుడు ఏపీ గవర్నర్ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉండటం తెలిసిందే.కాగా నేడు ఆయన 88వ జన్మదినం సందర్భంగా సీఎం జగన్ తో పాటు మరి కొంతమంది రాజకీయ నేతలు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.