ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ తిరుగులేని విజయం సాధించడం జరిగింది.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో మునుపెన్నడూ లేని విధంగా అన్ని డివిజన్లలో వైసీపీ గెలిచింది.అదే రీతిలో మున్సిపల్ ఎన్నికలలో కూడా.
ప్రజలు వైసిపి పార్టీని ఆదరించటం తో అద్భుత ఫలితాలు రావడంతో సీఎం జగన్ సోషల్ మీడియాలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.
ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి.గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు అని స్పష్టం చేశారు. అన్నిటికీ మించి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలలో వైసిపి గెలవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.
చంద్రబాబు సొంత అడ్డాలో నే వైసిపి గెలవడం అనేది మామూలు విషయం కాదని.దీన్నిబట్టి ఏపీలో వైసీపీకి తిరుగులేదని మరోసారి రుజువైందని.విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.