ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చాలా మంది బీసీ నేతలకు పదవులను కట్టబెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఈ క్రమంలో ఎక్కువగా చిత్తూరు జిల్లాకు చెందిన నేతలకు మంత్రి పదవులు జగన్ అప్పజెప్పడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కొత్తగా ఎన్నికైన మంత్రులలో చాలావరకు చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.పాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి లను కోన్నసాగించిన జగన్ తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు.
దీంతో చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రుల సంఖ్య మూడుకు చేరింది.
ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ నాయకత్వం సంబరాలు చేసుకుంటోంది.
ఇక ఇదే సమయంలో చంద్రబాబు జిల్లా కూడా చిత్తూరు కావటంతో .రాజకీయంగా ఇది చంద్రబాబు కి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని.రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్యారెంటీగా చంద్రబాబు కి వచ్చే ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో భంగపాటు తప్పదని అందువల్లే జగన్ ఈ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీ గెలవలేని పరిస్థితి నెలకొంది.ఈ జిల్లాకి ఇప్పుడు జగన్ మూడు మంత్రి పదవులు కట్టబెట్టడం తో.బాబుకి రాబోయే ఎన్నికలలో మరింత ఇబ్బంది ఇది రావటం గ్యారెంటీ అని వ్యాఖ్యానిస్తున్నారు.