గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష పార్టీలు రాష్ట్రంలో రోడ్ల అధ్వానంగా ఉన్నట్లు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి.ఇటువంటి తరుణంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు కార్యక్రమానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో సరుకు రవాణా.ఎయిర్ పోర్టులు, పోర్ట్ లు రైల్వే మార్గాలు అనుసంధానం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడుతూఅక్టోబర్ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయి, వచ్చే వర్షా కాలం నాటికి రోడ్ల పనులు అన్నీ పూర్తి అవ్వాలి అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఇదే తరుణంలో పోర్ట్ ల వద్ద కాలుష్యం ఉండకూడదనిభూములు ఎక్కువగా ఉండే పోర్ట్ ల వద్ద పారిశ్రామిక అభివృద్ధి బాగా జరుగుతుందని ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు.
ఇదే సమావేశంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కి సంబంధించిన పనుల పురోగతిని కూడా సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకోవటం జరిగింది.