ఏపీ సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు.ఈ పర్యటనలో జగన్ తో పాటు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్లు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉన్నారు.ఏరియల్ సర్వే అనంతరం ప్రాజెక్టులో కీలక ఘట్టం స్పిల్ వే గైట్లు పని చేస్తున్న విధానాన్ని .ప్రాజెక్టు అధికారులతో అడిగి తెలుసుకొనున్నారు.రేడియల్ గేట్లు అదేరీతిలో అప్రొచ్ ఛానల్ పనుల గురించి ప్రాజెక్టు పురోగతిపై జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు మరికొంత మంది అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
నిర్ధేశించిన సమయానికి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇంకా అనేక విషయాల గురించి అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.ప్రాజెక్టు ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం సీఎం జగన్ తిరిగి తాడేపల్లి కి తన నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది.