ఫొటోటాక్‌ : అసెంబ్లీలో సీఎం నిద్ర, తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రాజధానులు అంటూ కొత్త ప్రకటన చేసిన విషయం తెల్సిందే.దాదాపు నెల రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

 Cm Jagan Mohan Reddy Sleeping In Ap Assembly-TeluguStop.com

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చి కొత్త రాజధానులను ప్రకటించాలని జగన్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.చాలా ముఖ్యమైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు మరో వైపు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.

అసెంబ్లీ బయట అంతా హడావుడిగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో జగన్‌ ఒక చిన్న కునుకు తీయడం ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది.ఎంతో సీరియస్‌ విషయంపై చర్చ జరుగుతుండగా ఇలా నిద్ర పోవడం ఏంటీ అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ ఫొటోను నారా లోకేష్‌ షేర్‌ చేసి ఒక పక్క రాజధాని కోసం రైతులు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తుంటే మీకు ఎలా నిద్ర వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube