సీఎం జగన్ కడప జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు.సెప్టెంబర్ 2వ తారీఖు వైయస్సార్ 12 వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించానున్నారు.
ప్రస్తుతం సిమ్లా పర్యటనలో ఉన్న జగన్ ఈరోజు రాష్ట్రానికి చేరుకొనున్నారు.అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి కడప జిల్లాకు వెళ్లనున్నారు.
అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వెళ్తారు.
ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి సెప్టెంబర్ రెండవ తారీకు.వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.అనంతరం స్థానిక నేతలతో.
పాటు ప్రజలతో సీఎం జగన్ ముచ్చటించనున్నారు.అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి తాడేపల్లి కి ప్రయాణం కానున్నారు.
సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ప్రస్తుతం జగన్ సిమ్లా పర్యటనలో కుటుంబ సభ్యులతో ఉన్నారు.
ఐదు రోజుల పర్యటన ముగించుకుని నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు.అనంతరం ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు.