ఏపీ సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా తిరువూరు వెళ్లనున్న ఆయన జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు.
ఈ మేరకు సుమారు 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేయనున్నారు.అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే.