దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీంతో వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాలపై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టింది కేంద్ర ప్రభుత్వం.ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి చోట్ల పాజిటివ్ కేసులు తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా జరుగుతూ ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి.
ఇలాంటి తరుణంలో సీఎం జగన్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వైరస్ పరిస్థితి అదే విధంగా రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య అదే రీతిలో ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయో వంటి విషయాలు గురించి సీఎం జగన్ కి వివరాలు అందించారు.
పరిస్థితి అదుపులో ఉన్నా గానీ ఒక్కసారిగా కేసులుపెరిగిన కంట్రోల్ చేసే రీతిలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు, అప్రమత్తంగానే ఉన్నట్లు జగన్ కి తెలియజేశారు.ఇదిలావుంటే ఇటీవల రోజువారి కేసుల సంఖ్య వందకు పెరిగిపోవటంతో ఏది ఏమైనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి పరిస్థితి ఆయన ఎదుర్కోవాలని అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
.