అమరావతి: నేడు సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా నగరి పర్యటన.జగనన్న విద్యా దీవెన పథకం రాష్ట్రస్ధాయి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.680.44 కోట్లను నేడే చిత్తూరు జిల్లా, నగరిలో బటన్ నొక్కి8, 44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నగరి చేరుకుంటారు.అక్కడ జరిగే బహిరంగ సభలో జగనన్న విద్యా దీవెన పథకం రాష్ట్రస్ధాయి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్, కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.







