ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.మంత్రులంతా పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది.
ఉద్యోగులకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు క్యాబినెట్ అనుమతి ఇవ్వటం జరిగింది.ఇక ఇదే తరుణంలో రాష్ట్రంలో కరోనా కట్టడి పై కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.
మంత్రి మండలిలో ఆమోదం పొందిన నిర్ణయాలు…
1)ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం. 2)జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు. 3)ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు. 4)ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం. 5)వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్లైన్స్తో ఒప్పందానికి ఆమోదం. 6)రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం. 7)కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చ. 8)పీఆర్సీ జీవోలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.
9)పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం. 10)కారుణ్య నియామకాలకు ఆమోదం. 11)కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు. 12)గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం. 13)ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం
.