తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది.ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఏర్పడడానికి ఆ మచ్చ పోవడానికి చాలా కృషి చేయవలసి వచ్చిందని చెప్పవచ్చు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత సంక్షేమం, వ్యవసాయం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన కేసీఆర్ తరువాత రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రాయితీ రూపంలో రైతులకు పనుముట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా చాల రైతు ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.అయితే వ్యవసాయంలో వినూత్న మార్పుల దిశగా ప్రభుత్వం దూసుకెళ్తోంది.
తెలంగాణ భూములు అత్యంత సారవంతమైనవి కావడంతో మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జిస్తారనేది ప్రభుత్వ ఆలోచన.అయితే కేసీఆర్ తాజాగా రైతులకు శుభ వార్త తెలిపాడు.
యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా గత సంవత్సరం లాగే పూర్తి స్థాయిలో గ్రామాల్లో కొనుగోలు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు.అయితే ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే బ్యాంకులతో 20 వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చినట్లు కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.