దేశ పార్టీలందు.టీడీపీ వేరయా! అన్నట్టుగా ఉంది ఏపీ అధికార పార్టీ పరిస్థితి!! నిన్న మొన్నటి వరకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వాళ్లు చేస్తున్న దందాలు, ప్రజల్లో వాళ్లకున్న ఇమేజ్ వంటి పలు అంశాలపై పెద్ద ఎత్తున సర్వే చేయించిన టీడీపీ అధినేత చంద్రబాబు.
ర్యాంకులు కూడా కేటాయించిన విషయం తెలిసిందే.ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది.
ఇక, అంతటితో అయిపోయిందనుకున్న తెలుగు తమ్ముళ్లకు టీడీపీ బాస్ మరో షాక్ ఇస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దిగువ, మధ్య, సీనియర్ నేతలు అందరిపైనా బాబు నిఘా పెట్టారని తెలుస్తోంది.
అదేవిధంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీల ఇంచార్జులపైనా బాబు సర్వే చేయిస్తున్నారనే టాక్ నడుస్తోంది.పార్టీలో వ్యవహరిస్తున్నారు? జనచైతన్య యాత్రలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తున్నారు? ప్రభుత్వ పథకాలను ఏవిధంగా ప్రచారం చేస్తున్నారు? దిగువ స్థాయి నేతలు పెద్ద వారితో ఎలా మమేకం అవుతున్నారు? ఇంచార్జులతో వైకాపా ఎమ్మెల్యేల కెమిస్ట్రీ ఎలా ఉంది? సమీప భవిష్యత్తులో వారి ప్రవర్తనా సరళి ఎలా ఉండనుంది? వంటి అనేక అంశాలపై చంద్రబాబు ఇటు పార్టీలోని తన విశ్వసనీయ నేతలు, ప్రభుత్వంలోని అత్యంత నమ్మకస్తులైన అధికారులతో సర్వే చేయిస్తున్నారట.
ఇప్పుడు ఈ విషయంపైనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.తన సొంత పార్టీ నేతలపై చంద్రబాబుకు ఇంత అనుమానం ఎందుకు? అనే ప్రశ్న అందరి వద్దా వ్యక్తమవుతోంది.ఒక వేళ ఈ సర్వేలు, నిఘాల్లో ఎవరైనా పనిచేయడం లేదని కానీ, ప్రజలతో సరిగా ఇంటరాక్ట్ కావడం లేదని కానీ తేలితే జరిగే పర్యవసానాలపై వారు చర్చించుకుంటున్నారు.
గ్రామ, మండల స్థాయి నుంచి కూడా జరుగుతున్న ఈ సర్వేలో ప్రతి కార్యకర్త, నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు టీడీపీ బాస్ చేస్తున్న యత్నంపై సర్వత్రా ఆసక్తి, అదేసమయంలో ఉత్కంఠ నెలకొంది.
మరి సర్వే ఫలితంగా ఎవరెవరికి అందలాలు లభిస్తాయో? ఎవరికి ఉద్వాసన ఉంటుందో చూడాలి.ఇప్పటికైతే.
బాబు సర్వే సంచలనం రేపుతోంది!!