విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను అందించడమే లక్ష్యంగా పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ను రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం అమరీందర్ సింగ్ విద్యార్థులకు స్వయంగా స్మార్ట్ ఫోన్లను అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు 26 చోట్ల స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.కరోనా నేపథ్యంలో 2020 నవంబర్ నాటికి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం ద్వారా 1.74 లక్షలకు పైగా స్మార్ట్ ఫోన్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.92 కోట్లు వ్యయం చేస్తుంది.
ఈ సందర్భంగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.
ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలను ప్రతి ఒక్కటిని అమలు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్లు చదువుకునేందుకు అవసరంగా మారినందుకు పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు.
మార్చిలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలని భావించామని, కానీ కొవిడ్ వ్యాప్తి కారణంగా ఆలస్యం అయినట్లు అమరీందర్ సింగ్ తెలిపారు.