ఏప్రిల్ 30న జరుగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ ప్రచారంలో కాంగ్రెస్ వర్సెస్ టీ.ఆర్.
ఎస్ మాటల యుద్ధం జరుగుతుంది.విపక్షాలకు అసలు ఎలాంటి అజెండా లేకుండానే ఎన్నికల ప్రచారం చేస్తున్నాయని రవాణాశాకా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనగా దానికి కౌంటర్ ఇస్తూ ఖమ్మ పట్టణ స్వేచ్చాయుత భావజాలం ప్రత్యేకమైనది.
ఖమ్మం ప్రజల తీర్పు ఎప్పుడొ వినూత్నంగా ఉంటుందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.తెలంగాణా సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు ఎదుర్కొని నిలబడ్డది ఖమ్మం పట్టణమని ఆయన అన్నారు.
రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నాడని.ఖమ్మం పట్టణాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు భట్టి.ఖమ్మం నగరం అభివృద్ధి పేరుతో సాగుతున్న అవినీతి ఎవరైనా ప్రశ్నిస్తే బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.కరోనా కష్టకాలంలో డాన్స్ లైటింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగుల ఆకలి తీరదని అన్నారు.
సెంట్రల్ లైటింగ్ ఫౌంటేన్ ఏర్పాటు చేస్తే నిరుపేదల కడుపు ఎలా నిండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క.ఖమ్మంలో సీసీ రోడ్ల మీద తీరు రోడ్లు వేసి బిల్లులు పొందిన ఘనత ఖమ్మం టీ.ఆర్.ఎస్ కార్పొరేటర్లకే దక్కిందని విమర్శించారు. కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది.