తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఆ బ్యాంకు ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.ఇందుకు సంబంధించి అసలు విషయంలోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న బలహీనమైన ఆర్థిక పరిస్థితిని గ్రహించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
రాబోయే ఆరు నెలల పాటు బ్యాంకు కు సంబంధించి డిపాజిట్ల స్వీకరణ పై అలాగే కొత్త రుణాలను బ్యాన్ విధిస్తున్నట్లు ఆర్బిఐ నిర్ణయం తీసుకుంది.
తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో ఆ బ్యాంకు సంబంధించిన ఖాతాదారులు తమ అకౌంట్ లోని డబ్బును ఆరునెలలపాటు ఉపసంహరించుకోలేరు.
పీపుల్స్ కోపరేటివ్ బ్యాంకు కు సంబంధించి ఎటువంటి నిధులను తీసుకునేందుకు ఏ ఖాతాదారునికి లభించదని ఆర్బిఐ ఓ ప్రకటనలో తెలియజేసింది.గత సంవత్సరం జూన్ 10 తర్వాత జరిగిన లావాదేవీలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుందని ఆర్బిఐ స్పష్టం చేసింది.
ఈ బ్యాంకు సంబంధించి నిర్ణయాన్ని పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంకు పై తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది ఆర్బిఐ.ఈ బ్యాంకులో వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఆ బ్యాంకు రుణం ఇవ్వలేదని ఆర్బిఐ సూచించింది.అంతేకాదు పాత బకాయిలను పునరుద్ధరించే అవకాశం కూడా లేకుండా పోయింది.కేవలం బ్యాంకు లో ఉన్న సొమ్మును బయటికి ఇవ్వడం మాత్రమే కాకుండా ఎవరైనా ఆ బ్యాంకులో కొత్త పెట్టుబడులు పెట్టాలన్న, కొత్త డిపాజిట్లను తీసుకోవాలన్న బ్యాంకు అంగీకరించదని ఆర్బిఐ తెలిపింది.
వీటితో పాటు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ఆస్తిని అమ్మకం లేదా ఆస్తులను బదిలీ చేయడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధాన్ని విధించింది.ముఖ్యంగా ఈ బ్యాంకులో ఉన్న సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్, అలాగే డిపాజిటర్ లకు చెందిన ఏదైనా మొత్తాన్ని ఖాతాలోని బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని నోటీస్ లో తెలిపింది.
ఈ రూల్స్ వచ్చే ఆరు నెలల వరకు అమల్లో ఉంటాయని ఆర్బిఐ స్పష్టంగా తెలిపింది.