సూర్యాపేట జిల్లా: పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని జెడ్పి సీఈఓ అప్పారావు అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను చూసుకోవాలని,
మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీళ్ళ ట్యాంకులను ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకొని కడిగి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండి హాసిం,ఎంఈఓ ధారాసింగ్,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.