ప్రస్తుతం తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అనేది లేదు.
అయితే ఈ అవకాశాన్ని బీజేపీ చక్కగా సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో బీజేపీ సాధ్యమైనంత వరకు బలమైన ప్రతిపక్షంగా ఎదగాలనే వ్యూహాన్ని పెద్ద ఎత్తున రచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం బీజేపీలో ఈటెల లాంటి నేతలు చేరిన సంగతి తెలిసిందే.అయితే ఇలా తాజాగా పార్టీలో చేరిన నేతలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పెద్ద ఎత్తున ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమైన పరిస్థితి ఉంది.
అయితే రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తమ అనుభవంతో బీజేపీ చీఫ్ ఆదేశాలను కూడా ధిక్కరించి తమ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్న దశలో బీజేపీలో వర్గ పోరు మొదలైందనే ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకున్న పరిస్థితి ఉంది.
ఇప్పుడిప్పుడే బీజేపీ ప్రజల్లోకి వెళ్తున్న దశలో వర్గ పోరు మొదలైతే ఇక ఇదే అంశం ప్రత్యర్థి కి చక్కని అవకాశంగా మారుతుంది.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ లాంటి పార్టీలకు ఇటువంటి ఘటనలు పెద్ద అడ్డంకిగా మారింది.అయితే ప్రస్తుతం బీజేపీ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ను దెబ్బతీయాలనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీస్తున్న పరిస్థితి ఉంది.</br
ఇప్పటికే రెండు మూడు వర్గాలుగా చీలిపోయిన బీజేపీ ఇలానే కొనసాగుతూ పోతే మరో కాంగ్రెస్ లా మారే అవకాశం వందకు వంద శాతం ఉంది.అయితే బహిరంగంగా ఎవరూ ఏ బీజేపీ నేత ఈ విషయాలపై చర్చించకున్నా అంతర్గతంగా చర్చ జరుగుతుందట.మరి రానున్న రోజుల్లో బీజేపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయనేది చూడాల్సి ఉంది.